ముషీరాబాద్, మార్చి 17 : ముషీరాబాద్ డివిజన్కు చెందిన పలువురు బీజేపీ నాయకులు శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముషీరాబాద్ డివిజన్ వైఎస్ఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నేతలు జీ.శ్రీధర్గౌడ్, మహిళా నేతలు సుకన్య, ప్రేమలత, శ్రీవల్లి తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గోపాల్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ముషీరాబాద్ నియోజకవర్గం ఘననీయమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అభివృద్ధికి ఆకర్శితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడానికి ముందుకు వస్తున్నారని, వారందరికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన శ్రీధర్గౌడ్, సకన్య, శ్రీవల్లి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులమై బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, వి.సధాకర్గుప్త, సాంబశివరావు, టీ.సోమసుందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, రజినీ, శివముదిరాజ్, సురేందర్, భిక్షపతియాదవ్, దీన్దయాల్రెడ్డి, ఆర్.మోజన్, అజయ్ ముదిరాజ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.