సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్లో నష్టాలు రావడంతో తన చిన్నాన్న ఇంటిలోనే దొంగతనం చేసి, నష్టాలను పూడ్చుకోవాలనుకున్న ఒక వ్యక్తిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంగోపాల్పేటలో నివాసముండే గోపాల్దాస్ కుటుంబం ఈ నెల 10న శంషాబాద్లో ఉన్న ఫ్యాక్టరీలో పూజలు చేసి.. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని 32 తులాల బంగారం కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాలను శోధించి అనుమానాస్పద వ్యక్తి వివరాలను బాధితుల నుంచి సేకరించారు. గోపాల్ దాస్ అన్న కుమారుడు సూరజ్ మలానీగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి 32 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.