శంషాబాద్ రూరల్, జూన్ 18 : యజమానికి ఇవ్వాల్సిన డబ్బులను సొంత అకౌంట్లో వేసుకొని పారిపోయాడో వ్యక్తి. శంషాబాద్ రూరల్ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊటుపల్లికి చెందిన ఇంజమూరి వినోద్ తొండుపల్లి వద్ద ఆన్లైన్ మణి ట్రాన్స్ఫర్ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గోగ్గు నరేశ్ ఆరు నెలలుగా పని చేస్తున్నాడు. వినోద్ లేకపోయినా దుకాణం నడిపించేవాడు.
ఏప్రిల్ 22న 1,70,000 రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పి..తన సొంత ఖాతాలో వేసుకున్నాడు. వినోద్కు అనుమానం వచ్చి నిలదీస్తే.. తిరిగి ఇస్తానని చెప్పి పారిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.