కవాడిగూడ, ఏప్రిల్ 19 : కారు స్టార్ట్ చేస్తానని చెప్పిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో పరారైన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్కు చెందిన బూక్యా నరేశ్ కారు మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో హోటల్ మారియట్ టీ జంక్షన్ సమీపంలో ఆగిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి నేను మెకానిక్ను.., మీరు వెనకాల నుంచి నెట్టండి అని చెప్పాడు.
వెంటనే కారు దిగి నెట్టగా.. కారులో కూర్చుకున్న గుర్తుతెలియని వ్యక్తి కారు స్టార్ట్ కావడంతో కారుతో పాటు హుడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.