కుత్బుల్లాపూర్, మార్చి 1 : నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.
పోలీసుల కథనం ప్రకారం… దూలపల్లి గ్రామంలో రోడ్డుపై సుమారు 35 ఏండ్ల వయస్సు ఉన్న వ్యక్తిని ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు కత్తులతో నరికి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.