హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజూ నగరంలో ఏదో ఒక మూలన హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టోలిచౌకి (Tolichowki) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెల్లిన యువకుడినికి కత్తితో పొడిచి చంపేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఇర్ఫాన్ (24) సోదరుడు అద్నాన్, బిలాల్ మధ్య టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 4 సమీపంలో ఆదివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ అక్కడికి వెళ్లి.. వారిద్దరి మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇర్ఫాన్పై బిలాల్లో కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించేలోపే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, ఘర్షణకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు.