గోల్నాక, ఆగస్టు 26: భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తకు నాంపల్లి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు చెప్పింది. అంబర్పేట ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం…గోల్నాకకు చెందిన రవీందర్ డ్రైవర్గా, ఆయన భార్య జ్యోతి బాగ్అంబర్పేట మల్లికార్జుననగర్లో టైలర్షాపు నడిపిస్తూ ఉపాధి పొందేవారు.
2016 మార్చి 1న రవీందర్ మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగి.. భార్య జ్యోతి గొంతును కత్తితో కోసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆమె తప్పించుకునే యత్నంలో చేయిపై కత్తిపోటుతో గాయమైంది. ఈ కేసు వాదనలు విన్న నాంపల్లి కోర్టు శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. రవీందర్కు పదేండ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.