హైదరాబాద్ : పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆసిఫ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కలీముద్దీన్ను అరెస్టు చేసేందుకు మంగళవారం ఉదయం దుండిగల్ పోలీసులు ఆసిఫ్నగర్లోని ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసుల నుంచి కలీముద్దీన్ తప్పించుకునేందుకు యత్నిస్తుండగా ఐదో అంతస్తు నుంచి కిందపడి చనిపోయాడు.
దుబాయి పంపిస్తానని చెప్పి కలీముద్దీన్ పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఓ మహిళా వద్ద రూ. లక్షా 30 వేలు తీసుకుని కలీముద్దీన్ మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కలీముద్దీన్పై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కలీముద్దీన్ను అరెస్టు చేసేందుకు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుంది.