మహేశ్వరం, జూలై 3: మహేశ్వరం మండల కేంద్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలోని శివగంగలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన శ్రీనివాస్(44) కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం ఉదయం శివగంగలో మద్యం మత్తులో స్నానానికి దిగి ఊపిరాడక మృతి చెందాడు.