కాప్రా, ఆగస్టు 15: కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీఎలైట్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో పంద్రాగస్టు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప్పల సురేశ్ (55) ప్రసంగిస్తూ గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి పోయాడు. తండ్రి ప్రసంగాన్ని అందరితోపాటు ఆయన కూతురు మైత్రి ఆసక్తిగా వింటూ వీడియో తీసింది.
అప్పటివరకు ఎంతో ఉల్లాస భరిత వాతావరణంలో ఉన్న లక్ష్మీఎలైట్ విల్లాస్ ఆవరణలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న మిత్రులు, బంధువులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి, సతీమణి కరుణ, కూతురు మైత్రిని పరామర్శించారు. ఉప్పల సురేశ్ మృతిపట్ల స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు, సీనియర్ కళాకారుడు, రచయిత, కళారత్నం మల్లం రమేశ్, మల్లారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.