మైలార్దేవ్పల్లి, నవంబర్ 10: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బుద్వేల్ గ్రామానికి చెందిన బిరాధర్ వెంకట్ రావు (24) హైటెక్ సిటీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
గురువారం కాటేదాన్లోని తన సోదరి ఇంటికి బైక్పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.