దుండిగల్, ఆగస్టు 26: రెడిమిక్స్ లారీ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సంగారెడ్డి జిల్లా, బొంతపల్లికి చెందిన రాజునాయక్ (31) బౌరంపేటలోని ఓ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
శుక్రవారం సాయంత్రం కంపెనీ పనిపై షాపూర్నగర్కు బైక్పై వెళ్లి..తిరిగి వస్తూ.. బహదూర్పల్లి శ్రీరాంనగర్గడ్డ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా, బహదూర్పల్లి వైపు వేగంగా వెళ్తున్న రెడిమిక్స్ కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజునాయక్ను వైద్యశాలకు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.