హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాసాబ్ ట్యాంక్లో ఫస్ట్ లాన్సర్ వద్ద నివాసం ఉంటున్న షరోజ్ అలియాజ్ యూసుఫ్.. తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. మెహదీపట్నం నుంచి అత్తాపూర్ వైపు వాళ్లు వెళ్తుండగా.. పిల్లర్ నెంబర్ 60 వద్ద రాంగ్ సైడ్లో వేగంగా వచ్చిన చెత్త లారీ వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టూవీలర్ నడుపుతున్న యూసుఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న అస్లాం అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాత్రి 1:00 సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. లంగర్ హౌస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.