శేరిలింగంపల్లి : ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం, కొప్పోలు జిల్లా, అయోధ్య నగర్ ప్రాంతానికి చెందిన భరణీ శ్రీనివాస్ గత కొంతకాలంగా మణికొండ శివపూరి కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్మెన్ పనిచేస్తు జీవిస్తున్నాడు.
కాగా భరణీ శ్రీనివాస్ మొదటి భార్య చనిపోతే రెండవ భార్యను కొంతకాలం కిత్రం వివాహం చేసుకున్నాడు. కానీ రెండవ భార్య సైతం గత 6 నెలలుగా భర్త శ్రీనివాసుకు దూరంగా ఉంటుంది. బుధవారం తాను పనిచేస్తున్న నిర్మాణంలో ఉన్న భవనంలో మొదటి అంతస్థులో చున్నీతో ప్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒంటరి జీవితం భరించలేక తాను ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.