కేపీహెచ్బీ కాలనీ, జూన్ 25 : ప్రేమించి పెండ్లి చేసుకున్న నెలరోజులకే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సౌభాగ్యకుమార్ నాయక్ (26) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ఐదేండ్లుగా కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లో నివాసముంటూ.. ప్లంబర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
నెల రోజుల కిందటే రాజశ్రీని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.