బండ్లగూడ : డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్వోటి పోలీసులు ఆరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం నైజీరియా దేశానికి చెందిన నేడకా డానియల్ అనే వ్యక్తి సన్సిటిలో కోకైన్ సరఫరా చేస్తుండగా పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
సదరు వ్యక్తి నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని నిండితుడిని ఆదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. విద్యార్థి వీసాపై ఇండియాకు వచ్చిన డానియల్ నెల రోజుల క్రితం హైదరాబాద్కు చేరుకొన్నాడన్నారు. కోకైన్, డ్రగ్స్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. ఎవ్వరికి డ్రగ్స్ అమ్ముతున్నాడు అనే అంశంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.