కేపీహెచ్బీ కాలనీ, జూన్ 22 : హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మంగళవారం మూసాపేట సర్కిల్లోని ముళ్లకత్వ నర్సరీని జడ్సీ మమత, డీసీ రవికుమార్, బయో అర్బన్ డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూకట్పల్లి జోన్ పరిధిలో ఉన్నతాధికారులు నిర్దేశించిన హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్కిల్లోని ప్రతీ వార్డులో నర్సరీలను అందుబాటులోకి తెచ్చి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. ఇంటింటికీ పంపిణీ చేసే పూలు, ఔషధ మొక్కలతో పాటు రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలలో నాటే మొక్కలను కూడా పెంచడం జరిగిందన్నారు. కాలనీలలో ప్రజలకు అందుబాటులో నర్సరీలను ఉంచామని ఉచితం గా మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే హరితహారాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆయా కాలనీలు, బస్తీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో సమావేశాలు నిర్వహించడం, ప్రజలందరినీ భాగస్తులను చేస్తూ హరితహారాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.