HomeHyderabadMallareddy Is The Winner Of The Cricket Tournament
క్రికెట్ టోర్నమెంట్ విజేత మల్లారెడ్డి
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వారం రోజులుగా ఫ్యాబ్టెక్లుస్లో భాగంగా జాతీయ స్థాయి అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
మేడ్చల్, మార్చి 14: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వారం రోజులుగా ఫ్యాబ్టెక్లుస్లో భాగంగా జాతీయ స్థాయి అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మంగళవారం జరిగిన ఫైనల్లో మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సేయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలతో తలపడింది.
ఎంఆర్ఐటీఎస్ 14 పరుగుల తేడాతో నెగ్గి, ఫ్యాబ్టెక్లుస్ కప్ను గెలుచుకుంది. బెస్ట్ బౌలర్గా విశ్వ, బాట్స్మెన్గా సేయింట్ పీటర్స్ విశాల్, మాన్ఆఫ్ ది సిరీస్, మోస్ట్న్స్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కెప్టెన్ షిరిడీనాథ్ కైవసం చేసుకున్నారు. విజేతలకు ప్రిన్సిపాల్ రవీంద్ర, పీడీ వెంకట్ నగదు, బహుమతులను అందజేశారు.