సిటీబ్యూరో /రంగారెడ్డి, మే 1 (నమస్తేతెలంగాణ) : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
నేరాల నియంత్రణలో ఐఏ ఆధారిత ‘టీజీ క్వెస్ట్’ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తామని, సైబర్నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అలాగే ఫ్యూచర్సిటీ నూతన కమిషనర్గా తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డ్రగ్స్ను సమూలంగా రూపుమాపుతామని, అలాగే, సైబర్ నేరాలను పూర్తిగా అదుపులోకి తెస్తామని, సైబర్నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.