వెంగళరావునగర్, డిసెంబర్ 19 : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. 10 గంటలకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
తల పై బండరాళ్లతో కొట్టినట్లుగా పలు గాయాలున్నాయి. అయితే హత్యకు ఉపయోగించిన రాళ్లు, ఇతరత్రా ఆయుధాలేని దొరకలేదు. ఆదివారం రాత్రి ఎక్కడో హత్య చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.