హైదరాబాద్ : హయత్నగర్లోని హెచ్పీ పెట్రోల్ బంకులో ఘరానా మోసం చోటు చేసుకుంది. తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్ధ్యానికి మించి పెట్రోల్ బిల్లు వేశారని వినియోగదారుడి ఆరోపించాడు. తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు అయితే 32 లీటర్ల పెట్రోల్ పోసినట్లు రసీదు ఇచ్చారని వినియోగదారుడు ఆందోళనకు దిగాడు. బంకు యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లోని HP పెట్రోల్ బంకులో ఘరానా మోసం
తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్ధ్యానికి మించి పెట్రోల్ బిల్లు వేశారని వినియోగదారుడి ఆరోపణ
హయత్నగర్లోని ఓ HP పెట్రోల్ బంకులో తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు అయితే 32 లీటర్ల పెట్రోల్ పోసినట్లు రసీదు ఇచ్చారని ఆందోళనకు… pic.twitter.com/fjCT8I37tC
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2026