కందుకూరు, నవంబర్ 24 : ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు మండలంలోని నేదునూరు, మాన్యగూడ, దాసర్లపల్లి తండా, దాసర్లపల్లి, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, ఊట్లపల్లి, సార్లరావులపల్లి, దెబ్బడగూడ, కందుకూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పడరాని పాట్లు పడుతున్నదని చెప్పారు. ఆచరణలో అమలు కాని హమీలను గుప్పిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యాంటీలను నమ్మి కష్టాలను తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. కర్నాటక ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే.. ప్రజలకు నరకం చూపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. కర్ణాటకలో మోసం చేసినట్లు తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అంటుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కర్నాటక మోడల్గా అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. 60 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేయనోళ్లు.. ఒక్క చాన్స్ ఇస్తే ఏం చేస్తారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు గొప్పలు చెబుతున్నారని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ర్టానికి ఇచ్చింది గుండు సున్నా అన్నారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఓటర్లను కొనుగోలు చేయడానికి డబ్బు సంచులు చేతబట్టుకొని తిరుగుతున్నారని, వారికి ఓటేస్తే మీ విలువైన ఓటు వృథా అవుతుందని సూచించారు. రాష్ర్టానికి మరోమారు సీఎం కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిలకమర్రి నర్సింహ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, గణేశ్ రెడ్డి, ఆనేగౌని అంజయ్యగౌడ్, సర్గారి బాల్రెడ్డి, జంబుల కరుణాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షడు సురుసాని రాజశేఖర్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ, సర్పంచ్లు కాసుల రామకృష్ణారెడ్డి, పొలెమోని బాలమణి అశోక్, రాంచంద్రారెడ్డి, మహేశ్, రజిత, ప్రవీణ్ నాయక్, మాజీ సర్పంచ్లు యాదిరెడ్డి, జంగయ్య, రాములు, గోవర్ధన్ నాయక్, మాజీ డైరెక్టరు జిట్టె రాజేందర్రెడ్డి, ఎలుక మేఘనాథ్రెడ్డి, ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, సామ ప్రకాశ్రెడ్డి, ఉన్ని వెంకటయ్య, సొలిపేట అమరేందర్రెడ్డి, చిర్ర సాయిలు, దేశం కృష్ణారెడ్డి, బర్కం వెంకటేశ్, యూత్ నాయకులు కొలను విష్నేశ్వర్రెడ్డి, తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, దేవేందర్గౌడ్, హన్మంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.