సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : నిషేధిత జూదం, గ్యాబ్లింగ్, బెట్టింగ్, పేకాట ఆడినా కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. ఈ వ్యసనాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను రోడ్లపైకి తేవొద్దని సూచించారు. రెండురోజుల్లో కీసర, రామన్నపేట పీఎస్ల పరిధిలో పేకాటాడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రహస్యంగా జూదం, బెట్టింగ్, పేకాట నిర్వహిస్తే డయల్ 100, రాచకొండ పోలీస్ వాట్సాప్ 9490617111కు సమాచారమివ్వాలని కోరారు.