బంజారాహిల్స్, జూలై 15: తనకు సినిమాలంటే చాలా ఇష్టమని, సినిమాల్లో నటించాలన్న ఆసక్తి చాలా ఉన్నదని సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అన్నారు. పీఎంజే జువెలర్స్ సంస్థ కోసం సితార నటించిన తొలి యాడ్ రిలీజ్ వేడుక శనివారం బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తల్లి నమ్రతా శిరోద్కర్తో కలిసి సితార మాట్లాడింది. తొలిసారిగా యాడ్ ఫిలింలో నటించడం చాలా సంతోషంగా ఉన్నదని, తాను నటించిన యాడ్స్ న్యూయార్క్లోని టైమ్స్కేర్ మీద ప్రదర్శించడం మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ఈ వీడియోలను చూసిన తన తండ్రి మహేష్బాబు ఎంతో ఎమోషనల్ అయ్యాడని, తాను అందుకున్న తొలి పారితోషకాన్ని చారిటీ సంస్థకు ఇచ్చేశానని సితార చెప్పింది. కాగా, మహేష్ బాబు కొడుకు గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని నమ్రతా శిరోద్కర్ను ప్రశ్నించగా, ప్రస్తుతం గౌతమ్ డిగ్రీ చదువుతున్నాడని, ఆరేడేండ్ల తర్వాత సినిమాల్లోకి వస్తాడని సమాధానం ఇచ్చారు.