Bandlaguda Jagir | బండ్లగూడ, మార్చి 21 : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్ ఒటెద్దు పోకడ పోతున్నారని పలువురు కార్పొరేటర్లు ఆయనపై గతంలో అవిశ్వసం పెట్టిన విషయం విదితమే. కోర్టు అదేశాలతో గురువారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్డీవో వెంకట్రెడ్డి అధ్యక్షతన అవిశ్వస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 22 మంది కార్పొరేటర్లలో ఒకరు మరణించగా 21 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి అవిశ్వసం పెట్టిన 16 మంది కార్పొరేటర్లు తప్ప మేయర్ మహేందర్గౌడ్తో సహ ఇతర కార్పొరేటర్లు హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసాన్ని అంగీకరిస్తూ 16 మంది కార్పొరేటర్లు చేతులెత్తి ఓట్లు వేశారు. కోరం సభ్యుల కంటే ఎక్కువ మంది ఉండటంతో ఆర్డీవో వెంకట్రెడ్డి అవిశ్వాసం నెగ్గినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సైతం తనపై పెట్టిన అవిశ్వాసంలో ఉన్నారని గ్రహించిన మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ పదవిని కాపాడుకోలేక పోయారని స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా లతాప్రేమ్గౌడ్ను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.