హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పలువురు ఎగ్జామ్స్ (Inter Exams) రాయలేకపోతున్నారు. టైమ్కు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలనే ఆత్రుతలో మరికొందరు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే సికింద్రాబాద్లో చోటుచేసుకున్నది. నగరానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని తన తండ్రితో కలిసి బైక్పై ఎగ్జామ్ సెంటర్కు వెళ్తున్నది. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న ఓ కాలేజీ వద్ద బైక్ అదుపుతప్పి వారు కిందపడిపోయారు. దీంతో ఆమెకు తలకు గాయాలయ్యాయి.
అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (Traffic Inspector) ఉపాశంకర్ స్పందించి వెంటనే తన వాహనంలో దగ్గర్లోని దవాఖానకు తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స చేయించి.. అనంతరం సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. దీంతో మానవత్వం చాటుకున్న ఇన్స్పెక్టర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.