MLA Padma Rao Goud | సికింద్రాబాద్, జులై 5 : చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రభుత్వానికి సూచించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి, బోనాలు వేడుకల్లో భాగస్వామ్యం కావాలని ఆలయం కార్యనిర్వహణాధికారి మహేందర్ రెడ్డి, ప్రధాన అర్చకుల నేతృత్వంలోని బృందం మోండా మార్కెట్ టకార బస్తీలోని పద్మారావు గౌడ్ నివాసాన్ని శనివారం సందర్శించి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా పద్మారావు దంపతులను సత్కరించి ఆశీర్వాదం అందించారు. కార్యక్రమంలో కిషోర్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.