చాదర్ఘాట్, జూలై 14: మలక్పేటలోని పురాతన చారిత్రక మహబూబ్ మాన్షన్ ప్యాలెస్ భారీ వర్షాలకు పాక్షికంగా కూలింది. దశబ్దాల క్రితం నిర్మించిన నాటి మహబూబ్ మాన్షన్ ప్యాలెస్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. చారిత్రక కట్టడం కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్యాలెస్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ప్యాలెస్ పక్కనే జనావాసాలు ఉండటంతో అటువైపు వెళ్లకుండా ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. నగరంలో రోజూ వర్షం కురుస్తుండటంతో ప్యాలెస్పై అంతస్తు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని బుధవారం నాడు కూలిపోయింది. పెద్ద శబ్దంతో మట్టిగోడలు కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివిధ శాఖల అధికారులు, స్థానిక ఎంఐఎం నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.