శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మజీద్బండా గ్రామంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి టీఆర్ఎస్ నాయకుడు మారబోయిన రాజయాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండి ఉరేగింపులో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మెడ్చల్ జిల్లాగ్రంథాలయ భోర్డు డైరక్టర్ నీరుడి గణేష్, శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు రాజుయాదవ్, రవియాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, రమేష్, కృష్ణ యాదవ్, కొడిచెర్ల రాము తదితరులు పాల్గొన్నారు.