హైదరాబాద్: నగరంలో మరోసారి భారీమొత్తంలో గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.55 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఒడిశాలోని కోరాపుట్ నుంచి హైదరాబాద్ మీదుగా మీరట్కు గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు. సినీఫక్కీలో ట్రక్కకు రహస్య క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయిని తీసుకెళ్తున్నారి వెల్లడించారు. గంజాయి రవాణాకు వినియోగించిన ట్రక్కు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.