హిమాయత్నగర్,ఆగస్టు21: దేశంలో ప్రజాస్వామిక విలువలు పతనమవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి రచించిన ‘ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం’ అనే పుస్తకావిష్కరణ సభ శనివారం హిమాయత్నగర్లోని మఖ్ధుంభవన్లో జరిగింది. కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, ఇప్టా ఉపాధ్యక్షుడు కందిమళ్ల ప్రతాప్, సీపీఐ నాయకులు వీ.ఎస్బోస్,ప్రభాకర్, సుదర్శన్,కెవీఎల్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.