ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొ. రాములు తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 2వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 7వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.
ఈ పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా తేదీలను సైతం ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.