జూబ్లీహిల్స్, అక్టోబర్ 11 : స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రపంచంలోని 2 శాతం అగ్రశ్రేణి పరిశోధకులలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని 12 మంది శాస్త్రవేత్తలు చోటు సంపాదించి విశిష్ట గౌరవాన్ని దక్కించుకున్నారు. డాక్టర్ గుళ్లపల్లి ఎన్.రావు, ప్రొఫెసర్ డి.బాలసుబ్రమణియన్, డాక్టర్.సావిత్రి శర్మ, ప్రొఫెసర్ జిల్కీఫ్, డాక్టర్ ప్రశాంత్ గర్గ్, ప్రొఫెసర్, డాక్టర్ మొహమ్మద్ జావీద్ అలీ, డాక్టర్ అనిల్ కె.మండల్, డాక్టర్ స్వాతి కలికి, డాక్టర్ రోహిత్ ఖన్నా, డాక్టర్ తారా ప్రసాద్, డాక్టర్ సయన్ బసు, డాక్టర్ రాజ నారాయణ్లతో పాటు పరిశోధన విభాగంలో డాక్టర్ శివాజీ సిసింతి మైక్రోబయాలజీ రంగంలో అగ్రశ్రేణి పరిశోధకులుగా గుర్తించబడ్డారు. నేత్ర సంరక్షణలో ఇప్పటివరకు 3.68 కోట్ల మందికి సేవలందించిన ఎల్వీ ప్రసాద్.. ఎస్సి ఇమాగో ఇనిస్టిట్యూషన్స్ రాంకింగ్స్-2023 లో ప్రపంచ వ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచిందని ఎల్వీ ప్రసాద్ పరిశోధన అధిపతి డాక్టర్ సయన్ బసు పేర్కొన్నారు.