హైదరాబాద్ : నగరంలోని జగద్గిరిగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఎల్ఎస్డీ, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం డార్క్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.