మైలార్దేవ్పల్లి, ఆగస్టు 11: పెండ్లికి పెద్దలు నిరాకరించినందుకు ఓ యువ జంట మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేతాజీనగర్కు చెందిన యువతి (17) ఇంటర్ చదువుతున్నది. మహబుబ్నగర్ మక్తల్కు చెందిన రవి (20) కాటేదాన్ ఇండస్త్రీయల్లోని ఓ కంపెనీలో లేబర్గా పని చేస్తున్నాడు. ఇద్దరూ నేతాజీనగర్లో ఉంటూ రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
రెండు కుటుంబాల పెద్దలకు వీరి ప్రేమ విషయం తెలిసింది. మేము ప్రేమించుకున్నాము.. పెండి ్లచేసుకుంటాం.. అని వీరిద్దరూ కుటుంబ సభ్యులకు తెలిపారు. చిన్న వయస్సులో పెండ్లి ఏంటిదని ఇద్దరిని పెద్దలు మందలించారు. అయినా.. పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. యువతి గురువారం ఉదయం రవి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కలిసి ఫ్యాన్కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య వివరాలు తెలుసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.