బంజారాహిల్స్, ఫిబ్రవరి 29: బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని వినాయక్నగర్లో ఉంటున్న సూర్యనగేశ్ (23) కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసై.. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఆరు నెలల కిందట ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, గతంలో చేసిన అప్పుల భారం ఎక్కువ కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన సూర్యనగేశ్.. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.