నేరేడ్మెట్, డిసెంబర్ 29 : తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను జవహార్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు త రలించారు. నిందితుల నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 11.5తులాల రోల్డ్గోల్డ్, 1.7 కేజీల సిల్వర్, రూ.70వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. దమ్మాయిగూడలో నివాసం ఉండే చెరు కుతోట సదాశివ డిసెంబర్ 13న ఇంటికి తాళం వేసి కుటుంబం తో కలిసి ఏలూరుకు వెళ్లారు. తిరిగి 17న వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించా రు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదు పులోకి తీసుకుని విచారించగా దొంగతనం విషయం బయట పడింది. బాలాజీనగర్కు చెందిన షేక్ అబ్దుల్ సుభాన్, షేక్ సద్దాం షరీఫ్, ఎండీ రషీద్, సయ్యద్ సాధిక్లుగా గుర్తించారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని.. రిమాండ్కు తర లించారు. వారిపై జవహార్నగర్, కీసర, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని గుర్తించారు. వారిలో ముగ్గురిపై పీడీ యాక్ట్ విధించారని డీసీపీ వివరించారు. ఈ చోరీ కేసు మిస్టరీని ఛేదించిన ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డీఐ మధుకు మార్, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో రాచకొండ డీసీపీ క్రైం యాదగిరి, అదనపు డీసీపీ శివకుమార్ పాల్గొన్నారు.