బంజారాహిల్స్, సెప్టెంబర్ 16: కొడుకు తీసుకున్న అప్పును తీర్చాలంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని అమృత వ్యాలీలో నివసించే టి.అభిషేక్ కుమార్(31)సాఫ్ట్వేర్ ఇంజినీర్.
అతడి తండ్రికి ఈనెల 13న రాహుల్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీ కొడుకు రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడు.. వెంటనే డబ్బులు కట్టాలని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. తన కొడుకు లోన్ తీసుకున్న విషయం తనకు తెలియదని, తనకు ఎందుకు ఫోన్ చేస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో బూతులు తిట్టడంతో పాటు అభిషేక్ తల్లిని ఉద్దేశించి రాహుల్ తీవ్రమైన దూషణలకు దిగాడు. ఈ విషయాన్ని కొడుకుకు చెప్పారు. అభిషేక్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.