సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జాతీయ పుస్తక ప్రదర్శన జాతరను తలపించింది.ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న హైదరాబాద్ బుక్ఫెయిర్కు రెండో రోజు శుక్రవారం భారీగా సందర్శకులు తరలివచ్చారు. స్టాళ్లన్నీ సాహితీ ప్రియులతో కిక్కిరిశాయి. ప్రతి స్టాల్ను కలియతిరిగి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు.మరోవైపు అలిశెట్టి ప్రభాకర్ వేదికపై ప్రముఖులు పలు పుస్తకాలను ఆవిష్కరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆవిష్కరణలు
అలిశెట్టి ప్రభాకర్ వేదికపై పలు పుస్తకాలను ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల అధ్యర్యంలో కొండపల్లి నిహారిణి రచించిన ‘కాల ప్రభంజనం’ కవితా సంపుటిని ‘టెంపెస్ట్ ఆఫ్ టైమ్’ పేరుతో డాక్టర్ ఎలనాగ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ సంపుటిని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు గౌరీశంకర్ ఆవిష్కరించారు. ప్రముఖ కవి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, గురజాల రామశేషయ్య, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కాంచనపల్లి గోవర్ధన్, కొండపల్లి వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. ‘తొడిమ లేని మొగ్గలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సినీ దర్శకుడు ఇంద్రగంటి మెహనకృష్ట మాట్లాడుతూ తాను చిత్రపరిశ్రమకు రావడానికి స్ఫూర్తి వాడ్రేపు వెంకట సత్యప్రసాదేనని, ఆయన కథలు కుటుంబానికి, సమాజానికి ముడిపడి ఉండేవని గుర్తు చేశారు. తాను తీసిన చిత్రాల్లో అవే అంశాలు కనిపిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో భావరాజు పద్మిని, రచయిత సత్యప్రసాద్, అకేళ్ల రాఘవేంద్ర, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ‘నేను ఇకడి భూమిని శిలా లొలిత’ నాలుగో సంపుటిని ప్రసిద్ధ సాహితీవేత్త, తెలంగాణ ఉద్యమకారిని డాక్టర్ తిరునగరి దేవకి దేవి ఆవిషరించారు. తెలంగాణ బుక్ ట్రస్ట్ ప్రతినిధులు చంద్రమోహన్, గోపిరెడ్డి, రమేశ్, కార్తిక్, తాళ్లపల్లి శివకుమార్, రూప తదితరులు పాల్గొన్నారు.
చర్చాగోష్టి
ప్రముఖ రచయిత్రి,కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత సజయ రచించిన ‘అశుద్ధభారత్’ రచనపై ముఖాముఖి కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌర్శంకర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు, డాక్టర్ సమున్నత వివిధ అంశాలపై మాట్లాడారు.
విజ్ఞాన గని
పుస్తక ప్రదర్శనను ప్రతిఏటా నిర్వహించడం సంతోషం. ఙ్ఞానానికి నిలయమైన పుస్తకాలు అనేకం ఇక్కడ ఉన్నాయి. సబ్జెక్టుల పుస్తకాలే కాకుండా అనేక నవలలు, ఇతర పుస్తకాలను చదవడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. సమాజం పట్ల అవగాహన కలుగుతుంది. ఇలాంటి అవకాశం కల్పించిన పుస్తక నిర్వాహకులకు, మా గురువులకు కృతజ్ఞతలు.
– సారా బేగం, తారా పీజీ కళాశాల, సంగారెడ్డి
మంచి పుస్తకం.. స్నేహితులతో సమానం
మంచి పుస్తకం గొప్ప స్నేహితులతో సమానం. ప్రభుత్వం ఇలాంటి బుక్ ఫెయిర్లను నిర్వహించడం వల్ల ఎంతో మంది సాహితీ ప్రియులతో పాటు విద్యార్థులకు కూడా సాహిత్యం, రచన, అనువాదం పట్ల అవగాహన ఏర్పడుతుంది. – అరుణ, తారా పీజీ కళాశాల, సంగారెడ్డి
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది
ఏటా మా విద్యార్థులతో కలిసి పుస్తక ప్రదర్శనను సందర్శిస్తాం. పుస్తకం మంచి మిత్రుడు అనే నానుడిని నిజం చేయడం సాహిత్యానికే చెల్లింది. జీవితానికి తోడై విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో పుస్తకం తన పాత్రను అద్భుతంగా అందిస్తుంది.
– డాక్టర్ సంధ్య, తారా ప్రభుత్వ కళాశాల తెలుగు అధ్యాపకురాలు, సంగారెడ్డి
అలిశెట్టి ప్రభాకర్ వేదిక నేటి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు
బుక్ ఫెయిర్ సమయం: మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9.00 గంటల వరకు.
మధ్యాహ్నం 3.30 గంటలకు కిశోర్కుమార్ రచించిన మార్పు పుస్తకావిషరణ
సాయంత్రం 4.15 గంటలకు శ్రీలేఖ రచించిన యూనిక్ థింకింగ్ పుస్తక పరిచయం
సాయంత్రం 5 గంటలకు బూర్ల వెంకటేశ్వర్లు రచించిన తెలంగాణ భాషానుశీలన పుస్తకావిషరణ
సాయంత్రం 6 గంటలకు ఒదిగిన కాలం పుస్తక రచయిత వొరి దత్తాత్రేయతో జూలూరు గౌరీశంకర్ ముఖాముఖి
రాత్రి 7 గంటలకు మతసామరస్యంపై కవిత్వం
అలయ్ బలయ్ కవిత్వం (గుజరాత్ గాయంపుస్తకం ఆధారంగా ప్రముఖులతో విశ్లేషణ-చర్చ) నిర్వహణ యాకుబ్.
రాత్రి 8గంటలకు పద్మిని బృందం చే పప్పెట్రీ షో
అనువాద సాహిత్యం ఓ వరం
అనువాద సాహిత్యం ఓ వరం లాంటిది. ‘వన్ హన్డ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ ఫ్రెంచ్ పుస్తకాన్ని ‘వందేళ్ల ఏకాంతం’ పేరుతో తెలుగులోకి.. జీన్ వాల్ జీన్ పుస్తకాన్ని ఫ్రెంచ్ నుంచే అనువదించారు. ఆ రెండు పుస్తకాలను కొనుగోలు చేశా.
– ఏనుగు నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్
రచయితలను ప్రోత్సహించాలి
రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుస్తక ప్రదర్శనకు వచ్చాను. నాకు పుస్తకం అందమైన వ్యసనం లాంటింది. నా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏమైనా కొత్త పుస్తకాలు వచ్చాయా అని వెతుకుతుంటే.. ఇంతలో శప్తభూమి, కొండపొలం వంటి పుస్తకాలు కొన్నా. నాకు మహ్మద్ ఖదీర్ బాబు కథలంటే చాలా ఇష్టం. పుస్తక ప్రదర్శనకు వచ్చే యువత కూడా సాహిత్యాన్ని బాగానే ఇష్టపడుతున్నారు. అభినందనలు
– ఇంద్రగంటి మోహనకృష్ణ, సినీ డైరెక్టర్
మతసామరస్యంపై సాహిత్య సమాలోచన
హిందూ-ముస్లిం రచయితలు రచించిన మతసామరస్యం అనే రచనలపై సాహిత్య చర్చ జరిగింది. ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ మాట్లాడుతూ గంగా జమున తహజీబ్ నగరంలో ప్రతిబింబిస్తుందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రజలంతా సమైక్యంగా ఉండేందుకు సాహిత్యాన్ని చదవాలని, అందుకు బుక్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అంబేదర్ యూనివర్సిటీ వీసీ కే.సీతారామారావు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మెర్సీ మార్గరెట్, వాహిద్ ప్రసంగించారు.