హైదరాబాద్: హైదరాబాద్లోని బోరబండలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. బోరబండలోని అల్లాపూర్లో రూ.2 లక్షల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాయి. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాన్ని పోలీసులు ఆరాతీస్తున్నారు.