సిటీబ్యూరో, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38, కనిష్ఠం 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 31 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.