కేపీహెచ్బీ కాలనీ, జనవరి 19: సర్వేంద్రియానం నయనం ప్రధానమని, తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీలో కంటి వెలుగు కేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను ఉచితంగా అందజేయడం, సాధారణ కంటి జబ్బులకు మందులను అందించడం, తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కంటి వెలుగు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ రవికుమార్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలున్నారు.
బాలాజీనగర్ వార్డు కార్యాలయంలో కంటి వెలుగు పరీక్షలను కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్, డాక్టర్లు ప్రతిభ, సౌమ్య, స్థానిక నేతలు ముత్యపాగ శ్రీనివాస్, అనీల్కుమార్, లలిత, భాస్కర్రావు, శారద, శ్రీశైలం ఉన్నారు.
కూకట్పల్లి వార్డు కార్యాలయంలో కంటి వెలుగు పరీక్షలను కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, సంతోష్ యాదవ్, చైతణ్య యాదవ్, జానకి తదితరులున్నారు.
బాలానగర్, జనవరి 19 : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కంటి సమస్యల నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కంటి వెలుగు రెండోవిడత కార్యక్రమం కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓల్డ్బోయిన్పల్లి వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రంలో ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో డీసీలు రవీందర్కుమార్, రవికుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందర్, మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, కర్రె జంగయ్య, హరినాథ్, అంబటి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాలానగర్ డివిజన్ పరిధిలోని బాలానగర్ వార్డు కార్యాలయం, ఇందిరానగర్ గుడిసెలలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాలలో పరీక్షలను కార్పొరేటర్ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీ రవీందర్కుమార్, బాలానగర్ మెడికల్ ఆపీసర్ డాక్టర్ చందర్, ఏఈ రషీద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఫతేనగర్ భగత్సింగ్పార్క్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈ పవన్, సీవో ఇందిరా, నాయకులు కె. రాములు, భిక్షపతి, శిల్పగౌడ్, కురుమయ్య, ప్రవీణ్, శేఖర్, సురేందర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట, జనవరి19: మూసాపేట డివిజన్ పరిధిలోని మూసాపేట వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, డీసీ రవికుమార్లతో కలసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. కార్యక్రమంలో యూపీహెచ్సీ డాక్టర్ రిషిత, డీఈ శ్రీదేవి, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, కర్క పెంటయ్య, జిల్లా గోపాల్, సుందర్, తుకారాం, సప్పిడి శ్రీనివాస్, రాజు, సత్యనారాయణ, ఈశ్వర్, జైరాజ్, అరుణ్, అర్జున్, అశ్విన్, మురళి, హరిత, శాంత, సుజాత, రమాదేవి పాల్గొన్నారు.
అల్లాపూర్,జనవరి19: అల్లాపూర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్ కమిటీహాల్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని కార్పొరేటర్ సబీహాబేగం ప్రాంభించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షడు మహ్మద్ గౌసుద్దీన్, లింగాల ఐలయ్య, వీరారెడ్డి, పిల్లి తిరుపతి, అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, సంజీవరెడ్డి తదితరలు పాల్గొన్నారు.
మొదటిరోజు 1039 మందికి కంటి పరీక్షలు
బాలానగర్, జనవరి 19 : కూకట్పల్లి నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ అభించింది. కూకట్పల్లి నియోజకవర్గంలో కంటి వెలుగు పరీక్షల కోసం మొత్తం 15 కేంద్రాలు ఏర్పాటు చేయగా బాలానగర్ పీహెచ్సీ పరిధిలోని 9 కేంద్రాలలో కంటి పరీక్షల కోసం 1653 ఇండ్లలో స్లిప్లు పంపిణీ చేయగా గురువారం 1039 మంది కంటి పరీక్షలకు హాజరై రిజస్టర్ చేసుకొని పరీక్షలు చేసుకున్నారు. పరీక్షల అనంతరం 526 మందికి కంటి అద్దాలు అందజేశారు.