రవీంద్రభారతి, జనవరి 3 : ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగా సప్తస్వరం 35వ వార్షికోత్సవం సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందానికి జీవితసాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవం రవీంద్రభారతిలోని మెయిన్హాలులో బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నటుడు మురళీమోహన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం హాస్యనటుడు బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణకంకణాన్ని మంత్రి ప్రదానం చేశారు.