మల్కాజిగిరి, మార్చి 18 : అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండల పర్వత ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్భాను రెడ్డి మృతి చెందాడు. శనివారం ఉదయం మల్కాజిగిరిలోని దుర్గానగర్లో ఉన్న స్వగృహానికి వినయ్భాను రెడ్డి పార్థివదేహన్ని తీసుకొచ్చారు. ఆయన భార్య స్వప్నారెడ్డి పుణేలోని మిలిట్రీలో మేజర్ డాక్టర్గా సేవలందిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఉదయం పార్థివదేహన్ని భారత మిలిట్రీ జనరల్ మనోజ్ పాండే, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సందర్శించి నివాళులర్పించారు. అలాగే తల్లిదండ్రులు నర్సింహా రెడ్డి, విజయలక్ష్మిని మిలిట్రీ అధికారులు, ఎమ్మెల్యే ఓదార్చారు. పూర్తి స్థాయి మిలిట్రీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్రెడ్డి, ఇన్స్పెక్టర్లు రవికుమార్, నర్సింహస్వామి బందోబస్తు నిర్వహించారు. అంత్యక్రియల కోసం స్వగ్రామం యాదాద్రి జిల్లా బొమ్మల రామారానికి పార్థివదేహాన్ని తరలించారు. కార్పొరేటర్ ప్రేమ్కుమార్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, రాముయాదవ్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.