ఘట్ కేసర్, ఫిబ్రవరి 13: తెలంగాణ సాధనకర్త, బంగారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఘట్ కేసర్ బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఛాలెంజ్ అధినేత జోగినపల్లి సంతోష్ విసిరిన చాలెంజ్ ను ఘట్ కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఛాలెంజ్ స్వీకరించి గురువారం మొక్కలు నాటారు.
బంగారు తెలంగాణ సాధన కర్త కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకుని భారతదేశ వ్యాప్తంగా సంతోష్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రతి ఒక్కరు స్వీకరించాలన్నారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. జోగినపల్లి సంతోష్ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు అబ్దుల్ అజీజ్, దేవరకొండ రాజా చారి, బిజిలి సదానంద్, ఎండి నజీర్, అబ్బగోని నాగరాజు గౌడ్, బానుక నవీన్, లక్ష్మయ్య, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఎండి సిరాజ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.