ఎల్బీనగర్, డిసెంబర్ 10: పీచర వెంకటేశ్వర్ రావు తనకు మంచి మిత్రుడని, ఆయన మరణం దిగ్బ్రాంతికి గురి చేసిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం పీ అండ్ టీ కాలనీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఆలిండియా చైల్డ్ లేబర్ అడ్వయిజరీ బోర్డు మాజీ సభ్యుడు దివంగత పీచర వెంకటేశ్వర్రావు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. పీచర వెంకటేశ్వర్రావు తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రుడన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన మరణం తీరని లోటన్నారు. ఉద్యమకారుల అభ్యున్నతి కోసం తన వంతుగా సహకారం అందిస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యమ సహచరుడుగా పీచర వెంకటేశ్వర్రావు చేసిన సేవలను కొనియాడారు.
ఉద్యమ సహచరుడి మరణం తమను కలిచి వేసిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యకారులు, నాయకులు కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, కొతి నర్సిరెడ్డి, రవీందర్రెడ్డి, కలిసినేటి ఆనంద్, శ్రావణ్ కుమార్ గుప్తా, కేవీ. రంగారెడ్డి, బీరెల్లి వెంకట్రెడ్డి, రాంనర్సింహా గౌడ్, కడారి స్వామి యాదవ్, దాము మహేందర్ యాదవ్, కొసనం వెంకట్రెడ్డి, శైలజ, శ్రీకాంత్రావు, పీచర కుమారుడు పీచర కృష్ణదేవ్ తదితరులు పాల్గొన్నారు.