ఎల్బీనగర్, నవంబర్ 3 : ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, అభివృద్ధి కొనసాగింపు కోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్ గుంటి జంగయ్యనగర్ కాలనీలో బీజేపీ నుంచి గోపాల్, యాదయ్య, కన్న, స్వరూప, కాంగ్రెస్ నుంచి కృష్ణమాచారి, లక్ష్మణ్, నర్సింగ్రావు, సురేశ్తో పాటు 150 మంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కొత్తపేటలో ఎల్బీనగర్ క్రిష్టియన్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీకి , ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందుతున్నదన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పరిష్కారం చేసుకుంటూ పోతున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై సరైన అవగాహన లేని ప్రతిపక్ష పార్టీల నాయకులు అనవసర ఆరోపణలతో పబ్బం గడుపుతున్నారన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం ఖాయమన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్రెడ్డి, కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, మధు గౌడ్, బస్తీ వాసులు సుమన్, శ్రీకాంత్, ప్రేంకుమార్, సత్తి, హనుమంత్, సంజీవ, ఆండాలు, నిర్మల, రేవతి, క్రిష్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు జాకబ్, దేవానంద్, ప్రసాద్, సాల్మోన్, మాథ్యూస్, మెగార్, ఆనంద్, ఏసుపాదం, టైటాస్ బాబు తదితరులు పాల్గొన్నారు.