Kaleru Venkatesh | ఆయన విద్యాధికుడు. ఢిల్లీ వర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. న్యాయవాదిగా ఎంతో మందికి సేవలందించారు. ఉద్యమ సమయంలో అడ్వకేట్ జేఏసీలో కీలక భూమిక పోషించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్లో పనిచేశారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్గా పోటీచేసి విజయం సాధించారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు పొందారు. బీఆర్ఎస్ తరఫున అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కాలేరు వెంకటేశ్.
అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేశ్ గోల్నాకలో జన్మించారు. ఆయన క్రిమినల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచారు. గోల్నాక కార్పొరేటర్గా పోటీచేసి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్లో చేరారు. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఆయనకు 2018 అంబర్పేట టికెట్ లభించింది. బీజేపీ నేత కిషన్రెడ్డిపై పోటీచేసి విజయం సాధించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు.
సేవలో సాటిలేరు
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కార్పొరేటర్ స్థాయి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో రోగులకు ప్రత్యేకంగా కేంద్రాన్ని తెరిచి పౌష్టికాహారం అందజేశారు. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు, మందులు అందజేశారు.
చనిపోయిన పేదల అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేశారు. బస్తీల్లో మంచినీటి సమస్యను తీర్చడానికి సొంత డబ్బులతో బోర్లు వేయించారు. దేవాలయాల్లో అర్చకులకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలకు డబ్బులు అందజేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒకడిగా మెదులుతున్నారు.
అభివృద్ధిలో తనదైన ముద్ర..
కాలేరు వెంకటేశ్ అంబర్పేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. బస్తీల్లో సమస్యలు పరిష్కరించారు. రవాణా సదుపాయాలు మెరుగుపర్చడానికి అలీకేఫ్ చౌరస్తా మీదుగా 120 ఫీట్ల రోడ్డును వేయించారు. అనేక ప్రాంతాల్లో బీటీ, సీసీ, వీడీసీసీ రోడ్లను నిర్మించారు. కోట్లాది రూపాయలతో పార్కులను అభివృద్ధి చేశారు. మోహినీచెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. త్వరలోనే ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి. బస్తీలలో మురుగు పారకుండా డ్రైనేజీ పైప్లైన్లు వేయించారు. వరదలొచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం చూపారు ఎమ్మెల్యే కాలేరు. ఫీవర్ హాస్పిటల్ ఎదురుగా రిటెయినింగ్ వాల్ను నిర్మించారు. మోహినీచెరువు, పటేల్నగర్, ప్రేమ్నగర్, బాపునగర్ ప్రాంతాల్లో నాలా పనులు చేపట్టారు. వానలు కురిసినపుడు వాటర్ లాగింగ్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ అయిదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయి.