హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాల (ఆగస్టు 8, ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమం) బ్రోచర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుడు సర్వాయి పాపన్న జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆ మహనీయుడి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ అధ్యక్షుడు డా. వట్టికూటి రామారావు గౌడ్, చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు, శేషగాని నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.