కంటోన్మెంట్, నవంబర్ 9: ఎవరెన్ని ఎత్తులు వేసినా, దివంగత ఎమ్మెల్యే, తన తండ్రి సాయన్న ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో కంటోన్మెంట్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత స్పష్టం చేశారు.
గురువారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో లాస్యనందిత తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్కి అందజేశారు. తొలుత కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో లాస్యనందిత తన తల్లి గీతమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం లాస్యనందిత భారీ ర్యాలీతో ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం లాస్యనందిత మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.